దేశంలో 3,395 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు!
Sat May 31, 2025 22:02 India
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, గత 24 గంటల్లో నలుగురు ఈ మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో అధికార వర్గాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. శనివారం నాటికి దేశంలో మొత్తం 3,395 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 685 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఇది కూడా చదవండి: లోకేశ్ కీలక ప్రకటనలు, సంస్కరణల వెల్లడి.. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు!
ఇదే సమయంలో ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 22న దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మే 26 నాటికి 1,010కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగి 3,395కి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన యాక్టివ్ కేసుల్లో కేరళలో అత్యధికంగా 1,336 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్లో 117 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహల్ ఇదివరకే కీలక విషయాలు వెల్లడించారు. దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల జన్యు క్రమాన్ని విశ్లేషించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమవుతున్న వేరియంట్లు ఒమిక్రాన్ ఉపరకాలేనని, ఇవి అంత తీవ్రమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. LF.7, XFG, JN.1, NB.1.8.1 అనే నాలుగు ఒమిక్రాన్ ఉపరకాలు కనుగొన్నామని, వీటిలో మొదటి మూడు రకాలు ఎక్కువ కేసుల్లో కనిపిస్తున్నాయని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ జైలుకుపోవడం మాత్రం పక్కా.. రెండు రోజుల క్రితం అనంతపురంలో..
పీఎస్సార్కు మరోసారి అస్వస్థత.. ఈరోజు సాయంత్రం వరకు!
ఈరోజు ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?
క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..
వెస్ట్ బైపాస్లో కీలక మలుపు - రింగ్ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!
పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #CoronaVirus #Cases #India #ExpertsSayNoNeed
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.